![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:20 PM
యాంటీ నార్కోటిక్ పోలీసులు, కర్ఖానా పోలీసులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ముగ్గురు డ్రగ్స్ విక్రేతలతో పాటు, 8 మంది వినియోగదారులను అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రేష్మి పెరుమాళ్, యాంటీ నార్కోటిక్ డీసీపీ సాయిచైతన్య తెలిపారు. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుందని గుర్తించినట్లు చెప్పారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కళాశాల యాజమాన్యం కూడా బాధ్యులవుతారని హెచ్చరించారు.