![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 12:59 PM
విద్యలో వెనుకబడిన గట్టు మండలాన్ని విద్యా పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వాయిలకుంట తండా, ముచ్చోనిపల్లి, తారాపురం గ్రామాలలో ఎంపీపీ నిధులతో రూ. 36 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించి, నీటి వసతి కల్పిస్తామన్నారు. మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.