![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 01:39 PM
దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారీ భూస్వామ్య విధానాన్ని నిర్మూలించాలి అని సిపిఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ పిలుపునిచ్చారు. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీమ్ భవన్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని పేర్కొన్నారు