![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 01:59 PM
మిషన్ భగీరథ నల్లా పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బస్ డిపో కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. మిషన్ భగీరథ నీటిని ఉచితంగా సరఫరా చేయాలని నినాదాలు చేశారు. మిషన్ భగీరథ స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇంటింటికీ మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చిందని, ఆరు సంవత్సరాల నుంచి నీటి పన్నులను వసూలు చేయలేదన్నారు.