![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 01:29 PM
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్ర సమీపంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును మంగళవారం ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంబించారు. పాఠశాల మండల కేంద్రానికి దూరంగా ఉండటంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లి రావడానికి ఇబ్బంది పడుతుండేవారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సును ఏర్పాటు చేశారు.