![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 10:13 AM
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 5వ తేదీన ఆరుద్ర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఉదయం 10 గంటలకు అన్నాభిషేకం, ఫలాభిషేకం జరుగుతుందని చెప్పారు. రాత్రి 7 గంటలకు భస్మాభిషేకం జరుగుతుందని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు