![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 03:17 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య బుధవారం మొహినాబాద్ మండలం పరిధిలోగల పలు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమాలలో భాగంగా మూడు లక్షల రూపాయల వ్యయముతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.