by Suryaa Desk | Wed, Jul 03, 2024, 04:17 PM
నారాయణఖేడ్ పట్టణంలోని సాయి సంజీవని వైద్యశాలలో చిన్నపిల్లల వైద్య విభాగమును బుధవారం స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డిని, నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ లను వైద్యశాల. వైద్యులు సుష్మ, జగన్మోహన్లు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పట్లొల్ల సంజీవరెడ్డి , వైద్యులను శాలువాలు పూలమాలలతో సన్మానించారు.