by Suryaa Desk | Thu, Jul 04, 2024, 02:51 PM
నీట్ పరీక్ష పేపర్ లీకేజీను నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం దేశ వ్యాప్తంగా చేపట్టిన బందును జిల్లాలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందును ఇచ్చాయని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డి. చందు, బి. హరీష్ తెలిపారు. నీటి పరీక్షల్లో అవకతవకులు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.