![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 10:25 AM
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మంజీరా నది తీరం బోరంచ గ్రామ శివారులోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి నక్షత్ర హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆలయంలో ప్రతి గురువారం ప్రత్యేక వారంగా కొలుస్తూ భక్తులు ఈ తెల్లవారి నుండి ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు చేపట్టి మొక్కులు సమర్పించుకున్నారు.