![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 03:17 PM
జుక్కల్ మండల కేంద్రానికి పంచాయతీరాజ్ శాఖ డిఫ్యూటీ ఈఈగా ఆర్. మధుబాబు మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇంచార్జీ డిఫ్యూటీ ఈఈగా రవీంద్రబాబు కొనసాగగా ఆర్. మధుబాబు పదోన్నతిపై కౌడిపల్లి నుండి జుక్కల్కు రావడం జరిగింది. మారుమూల జుక్కల్ ప్రాంతంలో మెరుగైన సేవలందించి నాణ్యమైన నిర్మాణాలు చేపట్టే విధంగా కృషిచేస్తూ జుక్కల్ అభివృద్దికి శాయశక్తులా కృషి చేయడం జరుగుతుందన్నారు. పీఆర్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.