![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:29 PM
NEETలో ప్రతిభ చాటిన ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పూర్వ విద్యార్థి వి. రోహిత్ ను గురుకుల ప్రిన్సిపాల్ ఎం. రాజారాం బుధవారం సత్కరించారు. విద్యార్థి రోహిత్ NEETలో 720/516 మార్కులతో 2375వ ర్యాంక్ సాధించాడు. రాజేంద్రనగర్ గిరిజన గురుకుల IIT కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి. సురేష్ రావు, హౌస్ మాస్టర్ వి. కృష్ణయ్య, పీడీ డాక్టర్ రామ్మోహన్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.