![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 04:25 PM
మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా పెద్దకల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే విజయరమణరావు, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.