![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:25 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం పల్లె దావాఖానాను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లె దావాఖానా సేవలను గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు. బిపి, షుగర్ వ్యాధులకు ఈ దావాఖానాలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్. వో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.