![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 01:58 PM
ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం మోజర్ల ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన నూతన ఆదనపు గదిని మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, దుస్తుల పంపిణీలో, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారాదని హెచ్ఎం యుగేందర్, ఎంఈఓ జయశంకర్ లను ఆదేశించారు.