![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:21 PM
పేదింటి ఆడపడుచులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కోట్పల్లి మండల కేంద్రంలోని బుగ్గాపూర్ గ్రామంలోని డీఎంఆర్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను వారు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ఉన్నారు.