![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:28 PM
గ్రామాల అభివృద్ధిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీపీ గాల్ రెడ్డి చెప్పారు. బుధవారం భిక్నూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే అక్కడికి వెళ్లి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులకు అన్ని శాఖల అధికారులు ఎంతో సహకారం అందించారని తెలిపారు.