![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 01:55 PM
ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో విషాదం చోటు చేసుకుంది. తల్లిగారింట్లో పుట్టినరోజు చేసుకోవాలని వచ్చిన వివాహిత అదే రోజు కరెంట్ షాక్తో మృతి చెందింది. రాజపేట మండలం పారుపల్లి వాసి భూపతి సురేష్, బాలాంజలి దంపతులు. సోమవారం బర్త్డే సందర్భంగా పిల్లలు, భర్తతో కలిసి గౌరాయిపల్లికి వచ్చింది. బాలాంజలి బట్టలు ఉతుకుతుండగా కరెంట్ షాక్కు గురై మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.