![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 04:39 PM
మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ధారావత్ జానకిని షాద్ నగర్ నియోజకవర్గం స్థానిక ప్రజాప్రతినిధులు కలిశారు. బుధవారం ఫరూక్ నగర్ మండలం ఉప్పరి గడ్డ మాజీ సర్పంచ్ సుమితా చందు నాయక్, కుందేలు కుంట తండా మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, రవీందర్, మల్లేష్ నాయక్ లు నూతన ఎస్పీ ధారావత్ జానకిని తన కార్యాలయంలో కలిసి పూలబొకే ఇవ్వడంతో పాటు ఘనంగా సన్మానించారు.