![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:27 PM
మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. 2019 జులై 3న మండల పరిషత్ కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 719 మంది ఎంపీటీసీ లు ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీకి రూ. 7. 50 లక్షలు వచ్చాయి. 15 వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలలో సీసీ, డ్రైనేజీలకు కేటాయించారు. తమ డిమాండ్ల ఒక్కటీ నెరవేరలేదని, ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘునాథ్ పేర్కొన్నారు.