![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:21 PM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి మూడు ఆవులు ఉదయం, 7: 00 గంటల ప్రాంతంలో మేతకు వెళ్లి కరెంట్ షాక్ కు గురై చనిపోయాయి. గ్రామ శివారులలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అటుగా వెళ్లిన మూడు ఆవులు విద్యుతాఘాతానికి గురయ్యాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని, తమను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.