by Suryaa Desk | Tue, Jul 02, 2024, 03:34 PM
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలని స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రటరీ నర్సిములు అన్నారు. మంగళవారం నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో అథ్లెటిక్స్ కిడ్స్ చాంపియన్షిప్ జిల్లా జట్టు ఎంపికలు జండా ఊపి ప్రారంభించారు. జిల్లా జట్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణ అన్నారు. పిఈటీ లు పాల్గొన్నారు.