![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 03:54 PM
ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యం అందించి పెద ప్రజలకు అండగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రి, చిన్న పిల్లల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా వుండాలని ఆదేశించారు.