![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:49 PM
గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేద ప్రజలకు పంపిణీ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడంలేదని షాద్ నగర్ బీఆర్యస్ యువనేత తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ ప్రశ్నించారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజావరప్రసాద్ మాట్లాడారు. ఇండ్లు ఇచ్చేదాకా పాలకులను నిద్రపోనివ్వను అనిహెచ్చరించారు.