![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:29 PM
వైద్యులు అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శమని జిల్లా యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకం రాజు అన్నారు. సోమవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గీరెడ్డి రవీందర్ రెడ్డి న్యూరో ఆసుపత్రి వైద్యులను ఆయన సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి వైద్యులు తక్షణమే వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారని కొనియాడారు. వైద్యులను ప్రతి ఒక్కరూ గౌరవించవలసిన అవసరం ఉందన్నారు.