![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:27 PM
భిక్కనూరు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ యాదగిరి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయిరెడ్డి మాట్లాడారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశానికి షబ్బీర్ అలీని పిలవడం పట్ల తాము అభ్యంతరం తెలుపుతున్నామన్నారు.