![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:42 PM
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట పై గల శ్రీ సాయిబాబా దేవాలయంలో 21 రోజుల సాయిబాబా మాల దీక్షను చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మంగళవారం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజు, బి ఆర్ ఎస్ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.