![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:47 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 65ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణికి జిల్లాలో మంచి స్పందన ఉందని, పలుసమస్యలు ఇప్పటికే పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు.