by Suryaa Desk | Mon, Jul 01, 2024, 03:01 PM
గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నాయకులు రియాజ్, మానవతారాయ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సీఎంతో మాట్లాడతామని, దీక్ష విరమించాలని కోరారు. జాబ్ క్యాలెండర్ విడుదల, గ్రూపు ఉద్యోగాల్లో పోస్టులు పెంపుపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దీక్ష సాగిస్తానని చెప్పడంతో వీరి ప్రయత్నం విఫలమైంది.