![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:18 PM
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని అన్నారం గ్రామంలో సోమవారం మండల వ్యవసాయ శాఖ అధికారి తనూజ రాజు పర్యటించారు. గ్రామంలో సాగు చేస్తున్న పత్తి పంటను పరిశీలించి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ సేవలను వినియోగించుకోవాలని, ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తానాధికారి కృష్ణ, రైతులు పాల్గొన్నారు.