![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:11 PM
కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జెటప్రోల్ గ్రామ దళిత భూనిర్వాసితులు కలెక్టర్ బడావత్ సంతోష్ కు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. శ్రీశైలండ్యామ్ నిర్మాణం సందర్భంగా 42 ఏళ్ల క్రితం ఇండ్లు, భూములు కోల్పోయామని ప్రభుత్వపరంగా ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటప్రకారం ఇంటికో ఉద్యోగం, భూమి, నష్టపరిహారం మంజూరుచేసి ఆదుకోవాలని వారు కోరారు.