![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:23 PM
పేద ప్రజలకు అండగా ఉంటానని సహా చట్టం ప్రతినిధి రవీందర్ చెప్పారు. సోమవారం భిక్నూర్ మండలంలోని పాత దళితవాడలో రేషన్ షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, గత 45 సం. లుగా దళిత ప్రజలు రేషన్ కోసం పట్టణానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి స్థానికంగా రేషన్ షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానికంగా ఏర్పాటుచేసిన రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలన్నారు.