![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:50 PM
ఖానాపూర్ పట్టణంలోని ఒకటో వార్డు శాంతినగర్ కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్లకు మున్సిపల్ వైస్ చైర్మన్ కావాలి సంతోష్ మరమ్మతులు చేయించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆ వార్డులోని పలు మిషన్ భగీరథ పైప్లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లీకేజీలు ఉన్న పైప్లైన్లకు ఆయన మున్సిపల్ కార్మికులతో మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.