![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 01:49 PM
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాహవాచన చేసి స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణం తదితర కార్యక్రమాలతో సీతారాములకు నిత్యకళ్యాణం జరిపారు. ఈ నిత్యకళ్యాణంలో 39 జంటలు పాల్గొని స్వామి వారికి కళ్యాణం నిర్వహించారు.