by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:45 PM
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జోగులాంబ గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు సూచించారు. సీఐ కార్యాలయంలో సోమవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. రాంగ్ రూట్లో వాహనం నడపరాదని, నో పార్కింగ్ లో నిలపవద్దని, టేప్ రికార్డు లను వాడరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని సూచించారు.