by Suryaa Desk | Tue, Jul 02, 2024, 04:09 PM
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం లోకేశ్వరం మండలం ఎమ్మార్వో మోతిరాంకు బీజేవైఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు విడుదల చేయడంలేదన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిధులు నియామకాలు అంటూ ప్రజలను మోసం చేశాయని పేర్కొన్నారు. మండల అధ్యక్షుడు గణేశ్, శ్రీధర్, మురళి, సందీప్, తదితరులు ఉన్నారు.