![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 04:01 PM
చర్ల మండలం తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను రెండు మూడు రోజుల్లో దించుతామని ప్రాజెక్టు డీఈ తిరుపతి మంగళవారం తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోందన్నారు. గేట్లకు సంబంధించిన రోలార్లు స్ట్రక్ అయ్యే అవకాశం లేకుండా బురదనీరంతా వెళ్లాక గేట్లను మూసివేస్తామన్నారు. రెండు మూడు రోజులపాటు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి వచ్చిన వరదనీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు.