![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:41 PM
దుబ్బాక నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ ప్రతినిధులకు ఈ నెల మూడున ఆత్మీయ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్న కార్యక్రమానికి జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు, నామినేటెడ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు హాజరుకావాలని కోరారు.