![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 01:44 PM
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేపాల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ శ్రీశైలం ప్రజలకు సూచించారు మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో రేపాల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో విషజ్వరాలు ప్రబలకుండా ఇంటింటా సర్వే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 3నెలల పాటు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోముల నివారణకు మలాథియాన్ ద్రావణం ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.