by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:41 PM
ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 4, 23 వార్డులలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.