![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 11:05 AM
ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశముంది. హైదరాబాద్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు కావస్తుందని, అయితే విభజన చట్టం అమలులో భాగంగా అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని, వాటికి పరిష్కారం కనుగునేందుకు ఈ నెల 6వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లో సమావేశం ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరం కలసి కూర్చుని కొన్ని సమస్యలకు పరిష్కారానికి చర్చిద్దామని కోరారు. ఈ అవుదామని లేఖలో పేర్కొన్నారు.ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేద్దామని తెలిపారు. రెండు రాష్ట్రాల చర్చలు సత్ఫలితాలనిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి దిశగా , రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని, అందువల్ల సమావేశమై చర్చిద్దామని చంద్రబాబు లేఖలో కోరారు. బహుశా ఈ నెల 6వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగే అవకాశముంది.