by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:32 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్జీ-3, ఏపీఏ జీఎం కార్యాలయాల ఉద్యోగులకు గత నెల 8న పర్యావరణ పరిరక్షణ అంశంపై నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు మంగళవారం జీఎం కార్యాలయ ప్రాంగణంలో బహుమతి ప్రధానం చేశారు. ఆర్జీ- 3 జీఎం ఏరియా సుధాకరరావు, ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా ఏరియాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.