by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:52 PM
మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ సైతం తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని మెడికల్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రిమ్స్ సిబ్బంది, వైద్య విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం సెల్ఫీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అశోక్, తిప్పస్వామి, సందీప్ పవర్, ఇద్రిస్ అక్బాని, తదితరులు పాల్గొన్నారు.