![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:43 PM
నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో సోమవారం స్వాతి అనే 7వ తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగింది. పాఠశాలకు వెళ్ళడం ఇష్టం లేకే పురుగుల మందు తాగినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం విద్యార్థినిని తండ్రి హాస్టల్ లో వదిలి వెళ్ళిన కొద్దిసేపటికే ఇంటి నుండి తెచ్చుకున్న పురుగుల మందు సేవించింది. కాగా విద్యార్థినిని 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.