by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:39 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల సర్వసభ్య సమావేశాన్ని రేపు ఉదయం 11: 30 గంటలకు ఎంపీపీ రవీందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అరుణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కాగా వచ్చేనెల 2న నిర్వహించాల్సిన సభను పార్లమెంటు సమావేశాల కారణంగా రేపటికి మార్చిన విషయం గమనించాలని ఆమె కోరారు.