by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:56 PM
షాద్ నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విచారణ వ్యక్తం చేశారు. పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఘటలో మృతిచెందిన, గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.