by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:22 PM
బహుభాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని శుక్రవారం మహబూబ్ నగర్ మాజీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ 103వ జయంతి కార్యక్రమాలు జితేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సంస్కరణలకు ఆధ్యుడు పీవీ తెలంగాణకు చెందిన నేత కావడం గర్వకారణమని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు.