![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:18 PM
బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో శుక్రవారం బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ ఏడాదిలో పీఎంఈజీపీ కింద యూనిట్లను స్థాపించడానికి అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు వ్యక్తిగత, సంఘం ద్వారా నిర్వహించే కార్యకలాపాలకు బ్యాంకులు రుణాలు అధికంగా ఇవ్వాలన్నారు.