![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 03:22 PM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూలై 3న హైదరాబాదులో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. శనివారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 15, 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.