by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:04 PM
దేవరకొండలోని ఆర్టీసీ డిపోను శుక్రవారం నల్గొండ ఆర్ఎం రాజశేఖర్ సందర్శించారు. బస్ డిపోను, స్టేషన్ ను పరిశీలించి డిపో ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు కష్టపడి పనిచేసి లక్షే లక్ష్యం చాలెంజ్ ను చేరుకోవాలన్నారు. డిపోను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం మాధవి, ఇంచార్జి డీఎం పాల్, అసిస్టెంట్ మేనేజర్ సైదులు, ఎంఎఫ్ సునీత తదితరులు పాల్గొన్నారు.